ఈజీమనీ కోసం దొంగతనాలు చేసేవారు ఎక్కువయ్యారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో వారి ఆటలు సాగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలు చేసేవారు గుట్టు రట్టవుతోంది. సీసీ కెమేరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, జీపీఎస్ ద్వారా దొంగల్ని పట్టుకుని సొత్తు రికవరీ చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీపీఎస్ ద్వారా బుల్లెట్ దొంగలు పట్టుబడ్డారు. కడియపులంకలో చోరీకి గురైన రెండు లక్షల రూపాయల బుల్లెట్ జీపీఎస్ ద్వారా గుర్తించారు పోలీసులు. చోరీకి గురైన తన…