ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెలగటూరు, కామారెడ్డి జిల్లాలోనే గాంధరి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ లను, వైస్ చైర్ పర్సన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్…
ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులు, నాలలలో వున్న నిర్మాణాలను తొలగిస్తున్న సందర్భంగా పేదలు, మధ్యతరగతి ప్రజానీకం దీనికి సమిధలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్ధ ఆహ్వానించదగ్గదేనన్నారు. అయినప్పటికీ చెరువులు, నాలల పక్కన సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం…
స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండని, ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయండన్నారు సీఎం రేవంత్. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండని, వీటితోపాటు హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండని, మనకున్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ…
2026 మార్చి నాటికి పూర్తి చేస్తాము. సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు 300 రోజుల పాటు నీటి యెత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.. పెండింగ్ బిల్ అన్ని క్లియర్ చేస్తాం అన్న మంత్రులు.. పొరుగు రాష్ట్రాల తో సత్ సంబంధాలతో ఉంది త్వరితగతిన ప్రాజెక్టు పనుల చేపడతాం అన్నారు. గత ప్రభుత్వం కేవలం పనులు చేశారు జేబులు నింపుకున్నారు కానీ…
రెండు రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటలలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.. 27 తారీఖు అర్థరాత్రి గాజుల రామా రం LN బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తార్ వాహనంతో గుద్ది చంపాలని ప్రయత్నించడం బార్ సిబ్బంది గాయాలతో తప్పించు కొని పోలీసులకు ఫిర్యాదు చేసారు..…
గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,…
ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 మార్చిలో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని, ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. 1.81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చుపెట్టారని, 14వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో…
రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసిందన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారన్నారు బండి సంజయ్. నేత కార్మికులు…
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించెందుకే ఈ సమావేశం నిర్వహించామని, నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఆయన తెలిపారు. చిత్తశుద్ధి, నిబద్దతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించండని,…
మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ స్కీంల అమలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని, అంగన్వాడి టీచర్లతో పాటు ఆయాలకు సైతం శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇవ్వాలని, అప్పుడే చిన్నపిల్లలకు తినడానికి అనువుగా…