నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ కు వాస్తు మార్పులు చేపట్టారు అధికారులు. స్టేషన్ కు వాస్తు దోషం ఉండడం వల్లే కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఎస్సైలు వివాదాలతో బదిలీనో లేక సస్పెన్షన్ కో గురవుతున్నారని భావించిన అధికారులు.. వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తు మార్పుల్లో భాగంగా స్టేషన్ ముందు భాగం లో ఉన్న స్టోర్ రూమ్ ను గత నెల 29న కూల్చివేశారు పోలీస్ అధికారులు… హైదరాబాద్ నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెంట, హైదరాబాద్ కు దగ్గరగా…
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశమిచ్చారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత…
నూతన సంవత్సరం 2024 లోకి (సోమవారం) నేడు అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలుగు వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకున్నారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి…
ఎంజిఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 21 నుండి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజిఎం లో చేరి 2 మంది రికవరీ అయ్యారు. 7గురు చికిత్స పొందుతున్నారన్నారు. 1200 ఆక్సిజన్ బెడ్స్ , 3 ఆక్సీజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయని, పవర్ కట్ అయినపుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజిఎం లో నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించాలన్నారు. ఎంజీఎం…
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ అయకట్టు పరిధిలోని పంటలకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2023 స్పూర్తికి నాంధి పలికిందన్నారు. యాసంగి పంటకి నీరు అందించడానికి మానేరు నుండి నీటిని విడుదల చేసినామన్నారు. వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలని రైతులకి విజ్ఞప్తి చేశారు. అరుతడి పంటలు వేసి,ప్రభుత్వం నుండి ప్రోత్సాహం…
చలికాలంలో చాలా మంది దగ్గు మరియు జలుబుతో బాధపడుతుంటారు. ఛాతీలో కఫం పేరుకుపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుంది. కఫం ఉంటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం సాధ్యం కాదు. ఈ సమస్యకు ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద కషాయాన్ని తాగండి. మీరు 3-4 రోజుల్లో ఉపశమనం పొందుతారు. ఔషధ తయారీకి కావలసిన పదార్థాలు 1. సుమారు 1 అంగుళం అల్లం ముక్క 2.…
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమైంది. సిటీ లో భారీగా ఈవెంట్స్ , పార్టీ లు చేసుకునేందుకు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించడానికి యువత రెడీ అయ్యింది. రాత్రి 1 గంటల వరకే వేడుకలు చేయాలనీ పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. తాగి మద్యం వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు హైదరాబాద్ లో అన్ని ఫ్లై…
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ లో 7 విలీన గ్రామాలపై సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్లో విలీన గ్రామాలపై మతి భ్రమించి తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పతకాలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 7 విలీన…
రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించి.. ప్రమాదరహిత తెలంగాణ దిశగా విస్తృతంగా పనిచేయాలని.. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అధికారులకు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఇవ్వాల సచివాలయంలోని తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన…
రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల…