చైనా మాంజా దారం తగిలి గొంతుపై బలమైన గాయం కావడంతో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని లంగర్ హౌజ్లో చోటు చేసుకుంది. వైజాగ్కు చెందిన కె.కోటేశ్వర్రెడ్డి (28) గోల్కొండ మిలటరీ ఆస్పత్రిలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని అత్తాపూర్లోని తన ఇంటికి వెళ్తుండగా లంగర్ హౌజ్ ఫ్లైఓవర్పై చైనా మాంజా తన గొంతుకు తగిలింది. దీంతో కోటేశ్వర్ మెడపై బలమైన గాయం తగిలి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి…
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అయితే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అధికారులు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే అన్ని రకాలుగా లాభపడ్డారన్నారు.…
పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో సంక్రాంతి సందర్భంగా జరిగే అక్రమ కోడిపందాలను అరికట్టేందుకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది. కాక్ఫైటింగ్పై దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ, రూస్టర్లు స్టెరాయిడ్లు మరియు ఆల్కహాల్కు గురయ్యే రంగాల పునరుజ్జీవనాన్ని PETA నివేదించింది. చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చూడాలని, సవివరమైన చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జంతు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కన్నెత్తి చూసే పార్టీల పతనం ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ని అలెర్ట్ చేసినట్టు చెప్తున్నారని, బీఆర్ఎస్.. బీజేపీ మధ్య ఉన్న అనైతిక రహస్యమైత్రి తెలియదు అనుకోకండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు వెళ్తారు అనే మాటలు చెప్పడం సరికాదని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంని కూల్చాలని అనుకుంటే ఇటువైపు నుండి అంతకంటే…
నరేంద్రమోడీ రాక ముందు తెలంగాణలో ఐఎస్ఐ ఏజెంట్లు ఉండేవారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్ లలో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, పాకిస్థాన్ ఐఎస్ఐ భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందన్నారు. ఇప్పుడు భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK 47 లు…
అన్నారం బ్యారేజీని నిర్మించిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బ్యారేజీలో సీపేజ్ మరమ్మతు పనులను శనివారం ప్రారంభించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగమైన అన్నారం బ్యారేజీలో అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు గేట్ నంబర్ 38, 28 వద్ద చిన్నపాటి చుక్కలు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు రాయి, మెటల్, ఇసుకతో తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేసి లీకేజీని నియంత్రించి ఇసుక పారకుండా అడ్డుకున్నారు. కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) బృందం నవంబర్ 2న అన్నారం బ్యారేజీని సందర్శించి, మురుగు…
రామగుండం-2 డివిజన్లోని భూగర్భ బొగ్గు గని జీడీకే-2 ఇంక్లైన్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు నూతనంగా నియమితులైన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ శనివారం సందర్శించారు. రామగుండంలోని బొగ్గు గనులను తన తొలి సందర్శన సమయంలో, బలరామ్ ఇతర మైనర్ల మాదిరిగానే హెల్మెట్, బూట్లు మరియు ఇతర భద్రతా గాడ్జెట్లతో కూడిన పూర్తి మైనింగ్ దుస్తులను ధరించి మ్యాన్-రైడర్పై ప్రయాణించి భూగర్భ గనిలోకి వెళ్లారు. బొగ్గు తవ్వకాలతో పాటు కార్మికుల భద్రతా చర్యలను కూడా ఆయన…
ఇందిరమ్మ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపు కోవాలని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాలతో పాటు ప్రజలందరికి నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోగీ, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాధులతో సంతోషంగా జరుపుకునే పండుగ ప్రతి ఇంట్లో…
సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు వద్ద దండు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పాటు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్…
కొత్తూరు మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. కొత్తూరు మునిసిపాలిటీ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేందర్ చోబె దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ధర్మేందర్ చోబె దంపతులు వస్త్ర కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కూతురు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే…