బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్ మాదిగ మాట్లాడుతూ తాను బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక బీజేపీ కి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాదిగ వర్గాలకు మేలు…
సోషల్ మీడియా ప్రాముఖ్యత .. ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మే 13 లోక్సభ ఎన్నికల కోసం పార్టీని మరింత విస్తృతం చేయడానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున కనెక్ట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇంటర్నెట్లో మహిళలు, యువత మరియు నవయుగ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో, రాష్ట్రంలోని బిజెపి సోషల్ మీడియా వార్ రూమ్ రాష్ట్రంలోని ఓటర్లను చేరుకోవడానికి వివిధ సోషల్ మీడియా…
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తుపల్లి కాదు ఇది సత్తాపల్లి అని కొనియాడారన్నారు. సత్తుపల్లికి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫీల్ అవుతున్నానని, సత్తుపల్లి తెలుగుదేశం ప్రజలు తలుచుకుంటే ఎక్కడైనా గద్దె ఎక్కోచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కార్యకర్తలకంటే మన తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ పని చేశారని, నేను…
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలు వస్తున్నారు…మోడీ ప్రధాని కావాలని అంటున్నారు…కేంద్ర పథకాల తో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ కే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం…
కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఉంటాయని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని ఇతర పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలను సైతం కలుపుకొని పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ కు చెందిన మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో కెపిహెచ్బి డివిజన్ కి చెందిన గంగా శివకుమారి ప్రధాన…
లోకల్ గా ఇసుక కొరత ఉండొద్దన.. గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోవద్దని.. స్థానిక అవసరాలకు ఉచిత అనుమతి ఇస్తూ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి…
తాను చేరలేనంత దూరం కాదు… దొరకనంత దుర్గం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని శనివారం వివిధ కులసంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే 317 జీవో బాధిత ఉద్యోగులు కూడా కలిశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కలిశారు. జీవో 317 వల్ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నికలు ముగియగానే జీవో…
పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. అలా అయితే బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మెదక్ సీటును ఆ పార్టీ ఇతర ప్రాంతాల వారికి అమ్ముకున్నదని ఆరోపించారు.…
కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు త్యాగాల పార్టీ అని అన్నారు మంత్రి సీతక్క. ప్రజల కోసమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని ఆమె అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు వ్యక్తుల పార్టీలు స్వార్థపూరిత పార్టీలు అని ఆయన అన్నారు. ఓట్ల చీలిక కోసం కొత్త నాటకాలు…
కేసీఆర్ బ్లాక్ డే గా ప్రకటించడం గురువింద గింజను గుర్తు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయించారని, ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత పేరుతో డొంక బయట పడిందన్నారు. కవిత ను దృష్టిలో పెట్టుకొని లిక్కర్ అవినీతి పై విచారణ జరగలేదని, ఢిల్లీ అధికారుల పిర్యాదు మేరకు దర్యాప్తు జరుగిందన్నారు. ఢిల్లీ మద్యం…