ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్…
జగిత్యాల మార్కెట్లో మామిడి పండ్ల వ్యాపారం మందకొడిగా సాగుతోంది. సీజన్ ప్రారంభంలో జోరుగా ప్రారంభమైన వ్యాపారం క్రమేపీ తగ్గుముఖం పట్టిందని, పండ్ల నాణ్యత తక్కువగా ఉండడంతో నివేదికలు అందుతున్నాయి. జగిత్యాల పట్టణం శివార్లలో ఉన్న చెల్గల్ మామిడి మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. జగిత్యాల మామిడిపండ్లు ప్రసిద్ధి చెందినందున, వేసవిలో పంటను కొనుగోలు చేయడానికి వివిధ ఉత్తర భారత రాష్ట్రాల నుండి వ్యాపారులు కూడా ఇక్కడకు వస్తారు. అయితే, ఈ సంవత్సరం ప్రకృతి విభిన్న ప్రణాళికలను…
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ సమస్యలపై తదుపరి అధ్యయనాల బాధ్యతలు చేపట్టిన మూడు కేంద్ర సంస్థల్లో ఒకటైన పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) తన నిపుణుల బృందాన్ని బుధవారం రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధినిర్వహణలో అత్యవసర దృష్ట్యా బృందం మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ వద్ద విచారణ ప్రారంభించింది. గురువారం ప్రాథమిక కసరత్తు నిమిత్తం బుధవారం రాత్రికి అన్నారం బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది . CWPRS…
పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి శ్రీ ఎ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…. కొమురేల్లి ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా…
వరంగల్ హంటర్ రోడ్డు లోని నాని గార్డెన్లో ఏర్పాటు చేసిన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి…. మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవని ఆయన ఆయన పేర్కొన్నారు. నిన్న…
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బచేసే కుట్ర చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, అసలు సన్నాలు, దొడ్డు ఓట్లు ఎంత రైతులు పండిస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సన్నలు ఈ ఏడాది 14 లక్షల ఎకరాలు, 32 లక్షల దొడ్డు ఒడ్లు పండిస్తున్నారని, రైతులను ఆడుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందన్నారు అన్వేష్ రెడ్డి. సన్నలకు, దొడ్డు వడ్లకు కేంద్రం ఓకే ధర ఇస్తుందని, సన్నలకు…
బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వేయి పాల్లు నయమని, ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం అని గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసాం. ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామన్నారు. తరుగు,…
3 నెలల పసికందును అమ్ముతున్న ముఠా ని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సభ్యసమాజం తల దించుకునేలా చేసారు కొందరు మహిళలు. వీరు ఆడబిడ్డలే అన్నది మరిచారో ఏమో, అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు. ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వీరి గుట్టు రాట్టయ్యింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడిపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ…
అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోడీ అని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు & ఎంపీ రాజ్యసభ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన యాదాద్రి జిల్లాలో మాట్లాడుతూ.. మోడీ సరితూగే వ్యక్తి ఈ దేశంలో లేడని, లాల్ చౌక్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారు మోడీ అని ఆయన కొనియాడారు. తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకుల సందడి నెలకొంది అంటే మోడీ కారణమని,…
అకాల వర్షం వరి కొనుగోలు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టిస్తున్నందున, వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రాధాన్యమిచ్చి కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. తుంపర రైస్ మిల్లుల నుంచి డిమాండ్కు తగ్గట్టుగా వర్షంలో తడిసిన వరిని వీలైనంత ఎక్కువగా సేకరించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించినప్పటికీ, ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించలేకపోయింది. మార్కెట్ యార్డుల్లో వర్షం కురిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి దాదాపు అన్ని జిల్లాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.…