డబుల్ ఒలింపిక్ పతక విజేత PV సింధు మలేషియా మాస్టర్స్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జియితో ఓడిపోయింది. భారత షట్లర్ తొలి గేమ్లో 21-16 తేడాతో ఫైనల్ను ప్రారంభించింది. చైనా షట్లర్ రెండో స్థానంలో పునరాగమనం చేసి 21-5తో విజయం సాధించింది. చివరి గేమ్లో సింధు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించి 11-3తో ఆధిక్యంలో నిలిచింది. అయినప్పటికీ, వాంగ్ తన నరాలను పట్టుకుని స్టైల్గా పుంజుకుంది మరియు 16-21తో గేమ్ను కైవసం చేసుకుంది.…
Liquor Sales Prohibited in Bengaluru: శాసన మండలి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు కౌంటింగ్ జరగనున్నందున నేపథ్యంలో జూన్ 1 నుండి 6 మధ్య బెంగళూరులో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. జూన్ మొదటి వారంలో, అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్లు దాదాపు ఒక వారం పాటు మూసివేయబడతాయి. ఇకపోతే.. పబ్లు, బార్లు తమ కస్టమర్ లకు ఆల్కహాల్ లేని పానీయాలు, అలాగే ఆహారాన్ని అందించడానికి అనుమతించారు అధికారులు. TGSRTC: హైదరాబాద్ మహా నగరంలో డీలక్స్ బస్సులు..…
మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న మధ్యంతర పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే వారం రానున్నారు. తన పర్యటనకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం నీటిపారుదల శాఖ అధికారులు, మేడిగడ్డ బ్యారేజీ పనులను చేపట్టిన ఎల్అండ్టీ ప్రతినిధులతో సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీపై మధ్యంతర చర్యల అమలుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ముఖ్యమంత్రితో కలిసి బ్యారేజీ వద్దకు వస్తానని చెప్పారు. అయితే.. వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,…
తొర్రూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆలోచనలు కల్పించి మభ్యపెట్టిందని, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేశారని, వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు హరీష్ రావు. నిరుద్యోగ…
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మహోబాద్ కి దుకాన్ అంటారు ఇదేనా తెలంగాణ లో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని, 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదు మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ఆయన అన్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోళ్ల ప్రాంతంగా సమస్యత్మక ప్రాంతంగా ప్రకటించాలన్నారు.…
జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కిందన్నారు…
వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్ నుంచి ఆ సందేశం పంపిన సబైర్ నేరగాడు డబ్బులు ఫోన్పే చేసి, స్ర్కీన్షాట్ షేర్ చేయాలని కోరాడు. పలువురికి మేసేజ్లు పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,…
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్…
జగిత్యాల మార్కెట్లో మామిడి పండ్ల వ్యాపారం మందకొడిగా సాగుతోంది. సీజన్ ప్రారంభంలో జోరుగా ప్రారంభమైన వ్యాపారం క్రమేపీ తగ్గుముఖం పట్టిందని, పండ్ల నాణ్యత తక్కువగా ఉండడంతో నివేదికలు అందుతున్నాయి. జగిత్యాల పట్టణం శివార్లలో ఉన్న చెల్గల్ మామిడి మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. జగిత్యాల మామిడిపండ్లు ప్రసిద్ధి చెందినందున, వేసవిలో పంటను కొనుగోలు చేయడానికి వివిధ ఉత్తర భారత రాష్ట్రాల నుండి వ్యాపారులు కూడా ఇక్కడకు వస్తారు. అయితే, ఈ సంవత్సరం ప్రకృతి విభిన్న ప్రణాళికలను…