Kalvakuntla Kavitha : ఈడీ తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవిత పై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. మే 10న కవిత పై చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. 8364 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందని, బుచ్చిబాబు కవిత పాత్ర పై వాంగ్మూలమిచ్చారు ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని కవిత బుచ్చిబాబుపై ఒత్తిడి చేసిందని ఈడీ పేర్కొంది. అరుణ్ రామ్ చంద్ర పిళ్లయి ఇచ్చిన స్టేట్మెంట్లను కవిత ఒత్తిడి మేరకే వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని ఈడీ తెలిపింది. అయితే.. తాజా చార్జి షీట్ ను పరిగణనలోకి తీసుకుంది స్పెషల్ కోర్ట్.. లిక్కర్ స్కాం లో 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్ షీట్ లో పేర్కొన్న ఈడీ.. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని, 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని తెలిపింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని, 292 కోట్ల నేరం లో కవిత పాత్ర ఉందని ఈడీ వెల్లడించింది.
లిక్కర్ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసిన ఈడీ.. ఇప్పటివరకు లిక్కర్ కేసు విచారణలో 49 మందిని ఇంటరాగేషన్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనక పలుసార్లు విజయనగరతో కవిత సమావేశం అయ్యారని, సౌత్ గ్రూపు వచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఈడీ తెలిపింది. ఇండో స్వీట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్ 65% వాటా అని, కవిత పాత్ర పై ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలాలను చార్జ్ షీట్లో ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మనీశ్ సిసోడియా లతో కవిత సంభాషణలు జరిపిందని, లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ కు కోఆర్డినేటర్ గా వ్యవహరించాడని, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది అంటూ ప్రత్యేకంగా పేర్కొంది ఈడీ. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారని, 9 ఫోన్ లను ఈడీకి కవిత ఇచ్చారు ఈ క్రమంలో పొలిటికల్ షో చేసిందని ఈడీ తెలిపింది.
Also Read
ఈడి చార్జిషీట్ లో కవిత స్టేట్మెంట్ : ‘లిక్కర్ పాలసీ రూపకల్పనలో నా తరపున పాల్గొనాలని బుచ్చిబాబు కి నేను ఎలాంటి అథరైజేషన్ ఇవ్వలేదు. ఇండో స్పిరిట్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు ఎలాంటి వాటా లేదు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. బుచ్చిబాబు, రాఘవ ల మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే నాకు గుర్తులేదు, వాళ్ళ నెంబర్లు కూడా తెల్వదు. లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం నాకు సంబంధం లేదు, నా తరపున ఎవరు ఆప్ సంప్రదించలేదు, లంచాలు ఇవ్వలేదు. అరుణ్ పిళ్ళై నా ఫామిలీ ఫ్రెండ్, వికేండ్లలో తరచు కలుస్తుంటాం, బతుకమ్మ లాంటి కలిసి నిర్వహించాం. అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్ లను కవిత నిరాకరించింది. అరుణ్ పిళ్ళై సమీర్ మహేంద్రును హైదరాబాద్ లో కవిత కు పరిచయం చేశాడు. కవిత సమీర్ మహేంద్రు తో మాట్లాడిన విషయం గుర్తు లేదన్న కవిత. ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై నా తరపున కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ లో అభిషేక్ కు వాటాలు ఉన్న సంగతి నాకు తెలియదు. ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్త నన్ను కోరినా ఇంట్రస్ట్ లేదని చెప్పాను. మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనేక సందర్భాలలో కలిశాను, కానీమాగుంట రఘువరెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశాను.’
తాజావార్తలు
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?