ప్రపంచ కప్లో భాగంగా.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టిక్కెట్ల అమ్మకాలు గోల్ మాల్ అయ్యాయి. టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్కతా పోలీసులు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి నోటీసులు పంపించారు.