మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ వివాదం ముదురుతోంది. ఈ నెల మొదట్లో ముంబై శివాజీ పార్కులో జరిగిన భారీ ర్యాలీలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన సంచలన ప్రకటనతో వివాదానికి తెరలేచింది. మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలన్న ఆయన డిమాండ్ చుట్టూ నేడు మహా రాజకీయం తిరగుతోంది. లౌడ్స్పీకర్ల తొలగింపునకు రాజ్ ఠాక్రే డెడ్లైన్ కూడా విధించారు. మే 3లోగా వాటిని తీసివేయకపోతే మసీదుల బయట బిగ్గరగా హనుమాన్ చాలీసా వినిపిస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దాంతో, గడువు సమీపించే…