LK Advani: బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ఎల్కే అద్వానీకి ఈ అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ ఢిల్లీలోని ఆయన నివాసంలో లడ్డూ అందించి అభినందించారు.