Bhadrachalam Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి…
సోషల్ మీడియాలో ఆగంతకులు రెచ్చిపోతున్నారు. దేవుడిని, గుళ్ళను, దేవతలను ఎవరినీ వదలడం లేదు. తాజాగా కేటుగాళ్ళు మరీ పేట్రేగిపోయారు. భద్రాచలంలోని రాములోరి గుడిని టార్గెట్ చేశారు. Bhadrachalam temple city ..భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం పేరుతో ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అంతటితో ఆగకుండా మరీ రెచ్చిపోయారు. పలు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు ఆగంతకులు. రెండురోజులుగా ఫేస్ బుక్లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు రామభక్తులు. దీనిపై ఆలయ…
రెండేళ్ల తరువాత మళ్లీ శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగనుంది. కరోనా వల్ల ఈ రెండేళ్ల పాటు భక్తులు లేకుండా కళ్యాణాన్ని నిర్వహించిన దేవస్తానం ఇప్పుడు మాత్రం భక్తుల సమక్షంలోనే కళ్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. శ్రీరాముడిని హోలీ పండుగ రోజే పెళ్లి కుమారుడిని చేయడం ఆనవాయితీ.. అదే ఆనవాయితీని ఈరోజు స్వామి వారి పెళ్ళికొడుకుని చేసిన అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలో…