పశ్చిమబెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థ ఛటర్జీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు కూడబెట్టిన తీరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటకు తీస్తూ వస్తోంది. తాజాగా ఈడీ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్ను కొన్నట్లు ఈడీ విచారణలో తేలింది.