ఢిల్లీ సర్కారు తీసుకున్న బాణాసంచా నిషేధం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అత్యవసరం విచారించాలన్న డిమాండ్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
దీపావళి నాడు పటాకులు లేకుండానే ఢిల్లీలోని ప్రజలు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.