Ram Mandir: అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా, సినీ, వ్యాపారవేత్తలు, సాధువులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానాలనున పంపింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు అరుదైన వ్యక్తి ఆహ్వానం అందింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ సంతోషి దుర్గకు రామాలయ ట్రస్ట్ ఆహ్వానం పంపింది.