Ayesha Meera: 2007లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఇంకా స్పష్టతకు రాకపోవడంతో.. తాజాగా ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసును క్లోజ్ చేసిన అనంతరం అవశేషాలను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం సొంతూరు తెనాలిలోని ముస్లిం శ్మశాన వాటికలో అవశేషాలను ఖననం చేశారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్లకు అవశేషాలు అప్పగించగా.. అక్కడి నుంచి తెనాలి తీసుకువచ్చి ఈద్గా వద్ద ప్రత్యేక…