దిశ సంఘటన దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటన పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించాడు. ఈ మేరకు హంతకుల కుటుంబాలతో కలిసి పలు విషయాలను చర్చించారు ఆర్జీవీ. కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. గతంలోనే పోస్టర్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ కొన్నిరోజులు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా…
దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. కాగా నేడు దిశ తండ్రి అప్పీలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని ఆనంద్ చంద్ర, అనురాగ్ న్యాయస్థానానికి తెలిపారు. సినిమా టైటిల్ ‘ఆశ ఎన్ కౌంటర్’ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే…