దిశ సంఘటన దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటన పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించాడు. ఈ మేరకు హంతకుల కుటుంబాలతో కలిసి పలు విషయాలను చర్చించారు ఆర్జీవీ. కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. గతంలోనే పోస్టర్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ కొన్నిరోజులు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు సినిమా టైటిల్ ను చేంజ్ చేసి మరో పోస్టర్ ను విడుదల చేశాడు. అందులో నవంబర్ 26న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. “ఆశ ఎన్కౌంటర్” అనే టైటిల్ తో విడుదలైన ఈ ట్రైలర్ లో వాస్తవంగా జరిగిన సంఘటనలనే చూపించాడు వర్మ. ట్రైలర్ ఆరంభంలో ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు అంటూనే ప్రజలు టీవీలో చూసిన, తెలిసిన సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.