Today (19-01-23) Business Headlines: హైదరాబాద్ స్టార్టప్.. అరుదైన గుర్తింపు: హైదరాబాదులోని ఫిన్-టెక్ స్టార్టప్ సంస్థ MicroNsure Consultancyకి నేషనల్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను బీమా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ అండ్ CEO కమలాకర్ సాయి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MicroNsure Consultancy ఏర్పాటు లక్ష్యాలను వివరించారు.
తమ రహస్యాల్ని ఇతర పక్షాలతో పంచుకుంటే.. ఏ కంపెనీ అయినా ఉపేక్షించదు. కనీసం ఆరోపణలు వచ్చినా సరే, వెంటనే ఆయా ఉద్యోగుల్ని సంస్థ నుంచి తొలగించేస్తారు. తాజాగా గూగుల్ సంస్థ కూడా అదే పని చేయడం పెను సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన వివరాల్ని గోప్యంగా ఉంచడం లేదన్న ఆరోపణలతో.. బ్లేక్ లెమోయిన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది. గూగుల్ సంస్థలో బ్లేక్ లెమోయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ విభాగంలో పని చేస్తున్నాడు. గూగుల్…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. చమురు ధరలు భారీగా పెరగడం, రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాహనాల వినియోగం పెరగడంతో కొత్త కొత్త టెక్నాలజీతో వాహనాలను తయారు చేస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఫేషియల్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేసింది అవెరా ఏఐ మొబిలిటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అవెరా విన్సెరో పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను దుబాయ్ ఎక్స్పోలో…