ఇటీవల సంభవించిన అసని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు. రాష్ట్రంలో అసని తుఫాను ప్రభావం వల్ల పంటలు నష్టపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ అని గొప్పలు చెప్పకునే ముఖ్యమంత్రి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణం అన్నారు. గుంటూరు జీజీహెచ్లో ఆరాధ్య అనే చిన్నారి ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతికి…