Home
Ap
Ap News
-
Ap Ministers: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా. పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్… -
Tirumala: అన్నమయ్యకు ఎనలేని గౌరవం
అన్నమయ్యని అగౌరపరుస్తున్నారని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ అదనపు ఇఓ ధర్మారెడ్డి. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ,కళ్యాణోత్సవం,ఏకాంత సేవ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొంటారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధులలో మఠాలుతో పాటు స్థానికుల నివాసాలను తొలగించాం….వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలలో పునరావాసం కల్పించాం అన్నారు ధర్మారెడ్డి. అన్నమయ్య వంశీకులుకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా వస్తూన్న గౌరవ మర్యాదలు కల్పిస్తున్నాం అన్నారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నమయ్య ప్రాజేక్ట్… -
Jagan New Cabinet: మంత్రులకు శాఖల కేటాయింపు
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ… -
Ap Cabinet: ఏపీ కొత్త మంత్రుల జాబితా ఇదే
పాత,కొత్త కలిపి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. జాబితా ఫైనల్ చేశారు సీఎం జగన్. కాసేపట్లో గవర్నర్ వద్దకు పంపనున్నారు మంత్రుల జాబితా. అన్నీ ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ, రాజన్నదొర విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా,విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పశ్చిమగోదావరిః తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ కృష్ణా: జోగి రమేష్… -
Advocate Murder: ఏపీ హైకోర్ట్ అడ్వకేట్ దారుణ హత్య
దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంకటేశ్వర్లును దారుణంగా హతమార్చారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేదీనుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన అదృశ్యంపై కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ… -
Pawan Kalyan: పసికందుల మరణాలు విచారకరం
ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది… -
Guntur Taxes: వెబ్ సైట్లో లోపాలు.. పన్నులు కట్టలేక కష్టాలు
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నుల పరంపర చిత్రవిచిత్రంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ లోపాలతో వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ఖాళీ స్థలాలకు ఇంటి పన్నులు, ఇళ్లకు ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సీడీఎంఏ వెబ్ సైట్ లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో అందుబాటులో టెక్నాలజీ ఉన్నా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను నిర్ధారించే వెబ్ సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు… -
Kondepi Tension: ఎమ్మెల్యే ఇంటిముట్టడి యత్నం.. వివాదాస్పదం
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం… -
Tirumala Rush: తిరుమలకు భక్తుల క్యూ..సర్వదర్శనం టోకెన్లకు బ్రేక్
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు. తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో… -
Viman Restaurant: అక్కడ విమానంలో కూర్చుని బిర్యానీ తినొచ్చు
విమానం ఎక్కితే మంచి టేస్టీ ఫుడ్ తినవచ్చు. కేవలం అందులో ప్రయాణించేవారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు భోజనానికి విమానం ఎక్కుతున్నారు. అదేం బొమ్మ విమానం కాదు నిజమైన విమానం. విజయవాడ సిటీ దాటి గన్నవరం ఎయిర్ పోర్ట్కి వెళ్లే దారిలో హైవే పక్కన ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్కసారిగా చూసే ఎవరికైనా, నిజంగా ఫ్లైట్ ల్యాండ్ అయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఫ్లైట్…
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!