Minister Atchannaidu controversial comments on Super Six scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. సూపర్ సిక్స్ సహా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమయం చూసి మరీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఓ పథకంను అమలు…
మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్..…
పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే.. సస్పెన్షన్ కానుకగా ఇచ్చారని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఏపీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, వైసీపీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని మండిపడ్డారు. 15 ఏళ్లు నందమూరి బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశానని.. తనని కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. తన సస్పెన్షన్ వెనుక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ ఘటన కలకలం రేపుతోంది. లాడ్జిలో దిగిన యువతుల న్యూడ్ వీడియోలని చిత్రీకరించారనే ఆరోపణతో.. నలుగురు యువకులను యువతులు చితకబాదారు. ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Crop Cultivation: తొలకరి పంటకే ఇన్ని కష్టాలైతే.. మరి రబీ పరిస్థితి ఏంటి? విశాఖలోని ద్వారకలో బాయ్స్ హాస్టల్, లాడ్జి పక్కపక్కనే ఉన్నాయి. హాస్టల్లో…
Konaseema Farmers Water Crisis: వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో కోనసీమ రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. శివారు భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. తొలకరి పంటకే సాగునీటి కష్టాలు అయితే.. రబీలో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. Also Read: Buddha Venkanna: చంద్రబాబు 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతున్నారు.. బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు! అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం…
సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంతకాలం బతుకుతావ్?’ అని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ధ్వజమెత్తారు. చందబాబుకు 76 ఏళ్ల వయసా?, ఎన్నాళ్లు ఉంటాడో చెప్పలేమా.. ఇలాంటి మాటలేనా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు. తాను సీఎం చంద్రబాబును మొన్న ఢిల్లీలో చూశానని, 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి కర్నూల్ బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్లను చంద్రబాబు కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రంగాల వారీగా పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలకు సంబంధించి జనశక్తి శాఖ…
సినిమా డైలాగ్లు పోస్టర్లుగా పెట్టినందుకు కార్యకర్తలపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. నటులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్లు ఎక్కువ ఉంటాయని.. మీకు అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్లకు చెప్పి తీయించాలన్నారు. అసలు సెన్సార్ వాళ్లకు లేని అభ్యంతరం మీకు ఎందుకు? అని ప్రశ్నించారు. మంచి సినిమాలోని పాటలు పెట్టుకున్నా తప్పే.. డైలాగులు పెట్టుకున్నా తప్పే.. ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే.. ఏం చేసినా తప్పేనా?…
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని…
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం…