Home
Ap
Ap News
-
Maoist Narayana: లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ.. ఏపీ నక్సల్స్ ఫ్రీ స్టేట్!
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన నారాయణ సహా మొత్తం 9 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. ఏపీ డీజీపీ మాట్లాడుతూ…… -
CM Chandrababu: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభం!
తిరుపతి జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నాయుడుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అధికారిక సమావేశాల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం ఉదయం 11.30 గంటలకు దొరవారిసత్రం మండలం నెల్లబల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పుదూరు గ్రామానికి వెళ్లి.. కొత్తగా నిర్మించిన ఏపీ టిడ్కో గృహాలను ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఇది… -
Nara Lokesh: కార్యకర్తలే పార్టీ బలం.. టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
అమరావతిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిజమని అన్నారు. పార్టీ ఎదుగుదలలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, జెండా మోసే కార్యకర్తలే నిజమైన నాయకులని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించడం తన బాధ్యతగా భావిస్తున్నానని లోకేష్… -
IAS Officer Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు!
AP IAS Officer Transfers 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు కేటాయించింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీల్లో భాగంగా ఎస్. షాన్ మోహన్ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్గా… -
AP Tiger News: పెద్దపులి కథ సుఖాంతం.. ఏజెన్సీ ఇక ఊపిరి పీల్చుకో!
గత నెల రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో హల్చల్ సృష్టించిన పెద్దపులి కథ చివరకు సుఖాంతమైంది. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం, గంగవరం, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల వరకు తిరుగుతూ పశువులపై దాడులు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులి.. ఇప్పుడు మళ్లీ తన అసలు నిలయం అయిన పాపికొండల అభయారణ్యానికి చేరుకుంది. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పులి పూర్తిగా అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఇంతకుముందు పట్టుబడిన పులిని విశాఖకు తరలించి..… -
Praja Darbar: మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ!
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్లో కాలం తీరిన బాక్స్ లకు 59 రూపాయల రెంటల్… -
Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం… -
Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కంధాలపల్లిలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లే సమయంలో స్థానికులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో రోడ్డుకు అడ్డంగా పెళ్లి పందిరి ఏర్పాటు చేయడంతో.. మృతదేహాన్ని ఆ మార్గంలో తీసుకెళ్లొద్దని కొందరు నిరోధించారు. బదులుగా బురదతో నిండిన రహదారి, పంట పొలాల మార్గం ద్వారా తీసుకెళ్లాలని హెచ్చరించడంతో రెండు సామాజిక వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. Also Read:… -
Unseasonal Rains: రైతాంగంపై అకాల వర్షాల ప్రభావం.. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం!
బుధవారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల తాకిడి ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగంపై పడింది ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో ములగ తోటలు పూర్తిగా నేలకొరిగాయి. ఎకరం రూ.40,000 ఖర్చుపెట్టి సాగు చేశామని.. ఇంకా చేతికి పంట రాకుండానే ములగ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరంలో ఉన్నటువంటి నాలుగు నుంచి ఆరు గ్రామాల్లో ఇదేవిధంగా ములగ తోటలు ఈదురు గాలుల దెబ్బకి రైతులకు నష్టాలను తెచ్చాయి. Also Read: Ajit… -
CM Chandrababu: నాది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం.. అమరావతి దేవతల రాజధాని అవ్వాలి!
తాను ఎక్కువ పూజలు చెయ్యను అని, కానీ ఒక నిమిషం సంకల్పం తీసుకుంటా అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అని, హిందువులకు పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. తనది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం అని, అమరావతి దేవతల రాజధాని అవ్వాలని కోరుకున్నా సీఎం చెప్పుకోచ్చారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. పండుగలు మనకు…
తాజావార్తలు
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!