AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
- ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర
- రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.
‘రాష్ట్ర ఆర్థిక పురోగతికి, పారిశ్రామిక అభివృద్ధికి, ఏఐ డెవలప్మెంట్కి దోహదపడే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని కేబినెట్లో ఆమోదించడం జరిగింది. పెట్టుబడి దారులకి ఒక డెస్టినేషన్ ఉండేలా కేబినేట్ జరిగింది. దేశంలో నెంబర్ 1 దిశలో తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కలిపించే విధంగా ప్రభుత్వం ముందుకి వెళ్తుంది. రిలయన్స్ కన్స్యూమర్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ ఫ్యాక్టరీ, వాటి పెట్టుబడులకి, భూకేటాయింపునకి కేబినేట్ ఆమోదం తెలిపింది. చిత్తూర్ జిల్లాలో సోయా ఫ్యాక్టరీకి కేబినేట్ ఆమోదించింది. కర్నూలులో మష్రూమ్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని అభివృద్ధి చేసేందుకు కేబినేట్ ఆమోదం. మన రాష్ట్రంలో వీటి ఉత్పత్తికి అనుకూలంగా ఉండనుంది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
Also Read: AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!
‘టూరిజం అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో ఉన్న వనరులని వినియోగించుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో స్టార్ హోటల్స్ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదం తెలిపింది. అరకు వ్యాలీ, అమరావతి ఇలా టూరిజం ప్రాంతాలలో స్టార్ హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదించింది. సాఫ్ట్వేర్ రంగంలో కీలక పాత్ర వహించనున్న రైడన్ ఇన్ఫోటిక్ డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు, విశాఖలోని మూడు ప్రాంతాలలో అతి పెద్ద డేటా సెంటర్స్ కి సంబంధించి భూ కేటాయింపులకి కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా భవిష్యత్తులో మరికొన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉండనుంది. సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే రెవెన్యూ వచ్చే మార్గాలను చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ సంస్థ ఏర్పాటుకి కాబినేట్ ఆమోదం తెలిపింది. అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటిక్ కాంపౌనెంట్ సంస్థ ఏర్పాటుకి కేబినేట్ ఆమోదించింది’ అని మంత్రి పార్థసారథి చెప్పుకోచ్చారు.
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!