స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లాలోని వింజమూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదన్నారు. వైసీపీది మూడు ముక్కలాట.. మూడు రాజధానులు నినాదం అని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తే కనీసం…