Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం
- రాజధాని అమరావతిని ఎవరూ ఏం చేయలేరు
- వైసీపీ మూడు ముక్కలాట ఆడిందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లాలోని వింజమూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదన్నారు. వైసీపీది మూడు ముక్కలాట.. మూడు రాజధానులు నినాదం అని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతి కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాలేదని ధ్వజమెత్తారు. వైసీపీ అని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలన్నారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని.. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Iran War: యుద్ధాన్ని ముగించబోతున్నాం.. ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన!
‘‘రాజధాని మీద దుష్ప్రచారం చేశారు. ముంపు ప్రాంతం, స్మశానం అంటూ హేళన చేశారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నాం. రూ.2730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే రూ.60 వేల కోట్లు పింఛను కింద అందించాం. స్టూడెంట్స్ స్కూల్కి వెళ్లేలోపు తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం. శ్రీశైలం, పోలవరం వాటర్ ఉదయగిరికి కూడా వస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4 ను తీసుకొచ్చాం. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అదానీ సిద్ధంగా ఉన్నారు. నెల్లూరుకు పోర్ట్లు ఉన్నాయి.. ఎయిర్ పోర్ట్ వస్తుంది.. ఇక్కడి అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఉదయగిరికి రెండు ప్రాజెక్టులు వచ్చాయి.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి.’’ అని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?