Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం
- రాజధాని అమరావతిని ఎవరూ ఏం చేయలేరు
- వైసీపీ మూడు ముక్కలాట ఆడిందన్న చంద్రబాబు
స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లాలోని వింజమూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదన్నారు. వైసీపీది మూడు ముక్కలాట.. మూడు రాజధానులు నినాదం అని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతి కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాలేదని ధ్వజమెత్తారు. వైసీపీ అని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలన్నారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని.. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Iran War: యుద్ధాన్ని ముగించబోతున్నాం.. ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన!
‘‘రాజధాని మీద దుష్ప్రచారం చేశారు. ముంపు ప్రాంతం, స్మశానం అంటూ హేళన చేశారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నాం. రూ.2730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే రూ.60 వేల కోట్లు పింఛను కింద అందించాం. స్టూడెంట్స్ స్కూల్కి వెళ్లేలోపు తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం. శ్రీశైలం, పోలవరం వాటర్ ఉదయగిరికి కూడా వస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4 ను తీసుకొచ్చాం. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అదానీ సిద్ధంగా ఉన్నారు. నెల్లూరుకు పోర్ట్లు ఉన్నాయి.. ఎయిర్ పోర్ట్ వస్తుంది.. ఇక్కడి అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఉదయగిరికి రెండు ప్రాజెక్టులు వచ్చాయి.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి.’’ అని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
Trump-Iran Talks: స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్! అంతర్జాతీయ మీడియాలో కథనాలు
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
ట్రెండింగ్
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!