Chandrababu: స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- స్వర్ణాంధ్ర కోసం 6 సూత్రాలతో ముందుకెళ్తున్నాం
- రాజధాని అమరావతిని ఎవరూ ఏం చేయలేరు
- వైసీపీ మూడు ముక్కలాట ఆడిందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి జిల్లాలోని వింజమూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదన్నారు. వైసీపీది మూడు ముక్కలాట.. మూడు రాజధానులు నినాదం అని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతి కోసం ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తే కనీసం అసెంబ్లీకి కూడా రాలేదని ధ్వజమెత్తారు. వైసీపీ అని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలన్నారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని.. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇది కూడా చదవండి: Iran War: యుద్ధాన్ని ముగించబోతున్నాం.. ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన!
‘‘రాజధాని మీద దుష్ప్రచారం చేశారు. ముంపు ప్రాంతం, స్మశానం అంటూ హేళన చేశారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నాం. రూ.2730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే రూ.60 వేల కోట్లు పింఛను కింద అందించాం. స్టూడెంట్స్ స్కూల్కి వెళ్లేలోపు తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం. శ్రీశైలం, పోలవరం వాటర్ ఉదయగిరికి కూడా వస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4 ను తీసుకొచ్చాం. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అదానీ సిద్ధంగా ఉన్నారు. నెల్లూరుకు పోర్ట్లు ఉన్నాయి.. ఎయిర్ పోర్ట్ వస్తుంది.. ఇక్కడి అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఉదయగిరికి రెండు ప్రాజెక్టులు వచ్చాయి.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి.’’ అని చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!