ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. పీఆర్సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు తెలిపింది. పెండింగ్ డీఏలు…
ఏపీలో ఉద్యోగుల రిటర్మైంట్ వయసుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించానన్నారు సీఎం జగన్. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను. రాష్ట్ర…
ఏపీలో పీఆర్సీ అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పీఆర్సీ పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులు అడుగుతున్నంత కాకపోయినా వారు ఆనందంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే పేర్కొన్నారు. ఉద్యోగులు సహజంగా వాళ్ళ డిమాండ్స్ చేశారని, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం ఉద్యోగులకు చెప్పారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం ఉత్తమమయిన మార్గం వెల్లడిస్తారన్నారు.
ఏపీలో పీఆర్సీపీ ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిగిపింది. ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. అయితే నిన్న కూడా సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే నేడు సీఎం జగన్ మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామన్నారు.…
పీఆర్సీపై ఏపీలో క్లారిటీ రావడంలేదు. దీంతో ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్తో భేటీ కావాలని ఆశించడంతో వారితో జగన్ ఈ రోజు భేటీ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ నిర్వహించిన భేటీ ముగిసింది. సమావేశంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని వెల్లడించారు. అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని, ప్రాక్టికల్గా…
11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై అమలు చేయాలని కోరుతూ నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సీఎస్ సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్కు అందజేశారు. అయితే సీఎస్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్లు పలుమార్లు ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్శర్మ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సీఎస్ సమీర్ శర్మ కమిటీ 14.29 ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదకను సమర్పించారు. అయితే ఈ నివేదిక ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అయితే పీఆర్సీసై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారు…
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు 11వ పీఆర్సీసీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ కోరుతూ నిరసనలు చేపట్టారు. సీఆర్పై నివేదిక ఇవ్వాలంటూ సీఎం జగన్ సీఎస్ కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్ కమిటీ 14.29తో కూడిన పీఆర్సీని అమలు చేయాలంటూ నివేదిక సమర్పించారు. సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదక పూర్తిగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలిపారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ…
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలుమార్లు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఫిట్మెంట్పై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. ఉద్యోగులకు న్యాయపరంగా డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సీఎం జగన్తో కూడా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై కూడా…