గుర్ల డయేరియా విషయంలో ఏం జరుగుతుందని పరిశీలించమని అధికారులను ఆదేశించామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సెప్టెంబరు 14 నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంత మంది చనిపోయారనిది ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రాథమికంగా ఒక్కరు చనిపోయారని చెప్పారు.
పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసుల ఛేదించారు. అస్ఫియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అస్ఫియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.