వివిధ విభాగాల్లో కొనసాగుతోన్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డైన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం వచ్చిన ఆదేశాలను సర్కారు రద్దు చేసింది. రిటైరైనా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.