పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ లో కీలక చర్చ జరిగింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీ.. దీంతో.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఇక, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనుంది ఏపీ ప్రభుత్వం..
నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి రూ. 1600 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వీటిల్లో రూ. 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సోమవారం తన మొదటి సమావేశాన్ని ప్రారంభించింది, ఎన్నికల హామీలను నెరవేర్చడం, అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, పెరిగిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ వంటి పెద్ద అంశాలు చర్చకు వచ్చాయి. అమరావతిలోని వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్లపై సంతకం చేయగా, ఈ ఫైళ్లలో మెగా డీఎస్సీ, భూ పట్టాదారు చట్టం రద్దు, పెన్షన్ మొత్తాన్ని…
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సూపర్-6 పథకాల అమలుపై కేబినెట్ చర్చించనుంది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల ఫైళ్లను ఆమోదించనుంది కేబినెట్. అన్న క్యాంటీన్లకు ఇప్పటికే రూ. 164 కోట్ల కేటాయింపు. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్లో చర్చ జరుగనుంది. హామీ మేరకు పెంచిన…