ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. రౌడీయిజం చేస్తే బెదురుతామని భావించవద్దు నఅ్నారు.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. వైసీపీ సృష్టించిన విధ్వంసానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం.. ఆ బంద్కు సహకరించడం…
నేను 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారు. పార్టీ కార్యాలయల పైనా దాడులు ఎప్పుడూ జరగలేదు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారు. డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు.. పరిస్థితి…
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.…
ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా రేపు (అక్టోబర్ 20) ఏపీ వ్యాప్తంగా బంద్ చేయాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం దారుణమని, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజకీయ…
డ్రగ్స్, గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి.. వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. అందరికీ నోటీసులు ఇవ్వాలంటూ.. నోరు జారిన పట్టాభి.. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న దద్దమ్మకు చెబుతున్నా.. వరే బోసిడీకే నీకు దమ్ముంటే.. గంజాయిపై మాట్లాడిన తెలంగాణ పోలీసులకు, యూపీ పోలీసులకు, మీ అధికారులకు నోటీసులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు..…
టీడీపీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ ఆవిర్భవించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ఎన్నో అటుపోట్లను చూసింది. అధికారంలో ఉండటం ప్రతిపక్షంలోకి వెళ్లడం ఆ పార్టీకి కొత్తమే కాదు. అయినా గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.…
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది… ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి… మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది.. గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి.. వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్పై ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. గంజాయి విషయంలో టీడీపీ నేతలకు నోసులు ఇవ్వడంపై స్పందిస్తూ.. సీఎంను టార్గెట్ చేశారు…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అసలు దళితులు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… వైసీపీ దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు… దళితులకు నాగరికత లేదని మాట్లాడే ఆదినారాయణరెడ్డికి అసలు దళితుల ఓట్లు అడిగే హక్కులేదన్న ఆయన.. దళితులు ఎవ్వరూ బీజేపీకి…
తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు సంచలనం సృష్టించింది.. 2019లో జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురికాగా.. మరోసారి ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.. ఏకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్నే నిందితులు బెదిరించండం సంచలనంగా మారింది.. ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు సాక్షులు, పీపీకి బెదిరింపు లేఖలు రాసినట్టుగా గుర్తించారు.. ముఖ్యమైన సాక్షులను బెదిరించి కేసు నుండి బయట పడేందుకు పక్కా ప్లాన్ వేశారు నిందితులు.. జైలులో ఉన్న రాకేష్…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40, 191 శాంపిల్స్ పరీక్షించగా.. 483 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 04 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 534 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,90,56,256…