Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ గుడిలో అపచారం ఘటన బాధ్యులకు నోటీసులు..
- విజయవాడ దుర్గగుడిలో అపచారం ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ..
- అపచార ఘటనపై ఈవోకు నివేదిక అందజేసిన కమిటీ..
- అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు గుర్తింపు..
- స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ..
- ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అపచారం ఘటనపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అభిషేకానికి వినియోగించిన ఆవు పాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో, స్టోర్, పూజల విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అభిషేకానికి వాడిన బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది.
Read Also: Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్మన్ గిల్ ఏమ్మన్నాడంటే?
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
అయితే, ఈ ఘటనపై ఆలయ ఈవోకు కమిటీ నివేదికను సమర్పించింది. అలాగే, ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడం తప్పని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ విచారణలో స్టోర్, పూజల విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడినట్లు పేర్కొంది. శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించే అర్చకుడికి మెమో జారీ చేయడంతో పాటు అతడిని అంతర్గతంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. స్టోర్, పూజల విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
అలాగే, కమిటీ నివేదికను రెండు నుంచి మూడు రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్కు ఆలయ ఈవో పంపనున్నారు. ఇకపై ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయాలకు కట్టుబడి, నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని ఈవో స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!