Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ గుడిలో అపచారం ఘటన బాధ్యులకు నోటీసులు..
- విజయవాడ దుర్గగుడిలో అపచారం ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ..
- అపచార ఘటనపై ఈవోకు నివేదిక అందజేసిన కమిటీ..
- అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు గుర్తింపు..
- స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ..
- ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఆదేశం..
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అపచారం ఘటనపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అభిషేకానికి వినియోగించిన ఆవు పాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో, స్టోర్, పూజల విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అభిషేకానికి వాడిన బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది.
Read Also: Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్మన్ గిల్ ఏమ్మన్నాడంటే?
Also Read
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
- Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
అయితే, ఈ ఘటనపై ఆలయ ఈవోకు కమిటీ నివేదికను సమర్పించింది. అలాగే, ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడం తప్పని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ విచారణలో స్టోర్, పూజల విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడినట్లు పేర్కొంది. శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించే అర్చకుడికి మెమో జారీ చేయడంతో పాటు అతడిని అంతర్గతంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. స్టోర్, పూజల విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
అలాగే, కమిటీ నివేదికను రెండు నుంచి మూడు రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్కు ఆలయ ఈవో పంపనున్నారు. ఇకపై ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయాలకు కట్టుబడి, నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని ఈవో స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?