వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదంలో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జగన్.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జనం పెద్దఎత్తున దూసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బతింది. దీంతో వీఐపీని అందులో తీసుకెళ్లలేమని పైలట్లు చెప్పారు. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు. అయితే, ఇందులో నిజానిజాలెంత అనే దానిపై విచారణ చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని…
Praveen Pagadala : సంచలనం సృష్టించిన ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. హత్య కారణం కాదని, మద్యం తాగిన ఉన్న స్థితిలో సెల్ఫ్ యాక్సిడెంట్ ఏకైక కారణమని తేల్చి చెప్పారు. ఇవాళ రాజమండ్రిలో ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 42 సిసి ఫుటేజ్ లను విడుదల చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణం…
Pastor Praveen : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్…
విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Cambodia : కంబోడియాలో 300 మంది భారతీయులను అరెస్టు చేశారు. వీటిని అక్రమంగా కంబోడియాకు తీసుకొచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారు.
గుంటూరు జిల్లా పేకాటకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందా? నేతల అండ.. ఖాకీల ఆశీస్సులు నిర్వాహకులకు కలిసి వస్తున్నాయా? కొండలు.. గుట్టల్నే డెన్లుగా మార్చేస్తున్నారా? రోజుకో చోట సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఎవరికీ దొరకకుండా షోలు నడిపిస్తున్నారా? వడ్డించేవాడు మనవాడే అయితే చాలన్నట్టుగా వ్యవహారాలు సాగిపోతున్నాయా? గుంటూరు జిల్లాలో పేకాటలకు లోకల్ ఖాకీల అండ? గుంటూరు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేకాట కామన్. పోలీసుల దాడులు రొటీన్. కానీ.. ఏదో ఇద్దరిని పట్టుకోవడం.. నాలుగువేలు స్వాధీనం…