Machilipatnam: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు.. కట్చేస్తే..
- సంతోష్, రాముకు చాలా కాలంగా పరిచయం
- ఈజీ మనీ కోసం ప్లాన్ చేసిన కేటుగాళ్లు
- ముగ్గురు మైనర్లను గుర్తించి చేరదీశారు
- మద్యం, గంజాయి అలవాటు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Machilipatnam Robbery Gang: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తున్న ముఠా ఆటకట్టించారు కృష్ణాజిల్లా పోలీసులు. దీంతో మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టారు. భారీగా బంగారం, నగదును సీజ్ చేశారు. ఇక్కడ చూడండి.. గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఉంగరాలు, లాకెట్స్ లాంటి వాటితోపాటు వెండి వస్తువులు దొంగతనాలు చేస్తున్నారు. ఇవే కాదు.. మొబైల్ ఫోన్స్, విలువైన చిన్న చిన్న వస్తువులను ఇటీవల దోపిడీ దొంగలు ఎత్తుకు వెళ్తున్నారు. కానీ ఎవరు దోపిడీ చేస్తున్నారనేది మిస్టరీగా మారింది. ఈ దోపిడీ దొంగలను పట్టుకునేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు తలలు పట్టుకున్నారు. తీరా ఓ వన్ ఫైన్ మార్నింగ్… చోరీ చేసిన మొబైల్ ఫోన్లో సిమ్ కార్డు వేయడంతో దొంగల ఆచూకీ లభించింది. దీంతో ఈ చోరీల వెనుక ఉన్న ఇద్దరు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఈ ఇద్దరు సభ్యులు ముగ్గురు మైనర్లతో చోరీలు చేయిస్తున్నారని విచారణలో తేలింది.
READ MORE: Hyderabad: పదో తరగతి పరిచయం.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అందరికీ తెలియడంతో జంట ఆత్మహత్య..!
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన వల్లూరు సంతోష్, బందరు మండలం పల్లెపాలెంకు చెందిన కొక్కిలిగడ్డ రాముకు చాలా కాలంగా పరిచయం ఉంది. దీంతో ఇద్దరు కలిసి ఈజీగా డబ్బు సంపాదించటానికి ప్లాన్ చేశారు. బందరు ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లను గుర్తించి చేరదీశారు. వారికి మాయమాటలు చెప్పి మద్యం, గంజాయి అలవాటు చేశారు. వారిని చోరీలకు పాల్పడాలని రంగంలోకి దింపారు. ముగ్గురు మైనర్లతో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా ఈ ఇద్దరు ముఠా మైనర్లతో దొంగతనాలను చేయిస్తోంది. ఇప్పటివరకు పదికి పైగా చోరీలు చేయించినట్టు సమాచారం. ఇటీవల చోరీ చేసిన వాటిలో ఓ మొబైల్ ఉండటంతో అందులో మైనర్లలో ఒకరు సిమ్ కార్డు వేయడంతో పోలీసులకు టెక్నికల్ ఆధారం దొరికింది. దీంతొ మొదట వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వెనుక ఉన్న సంతోష్, రాము పాత్ర బయటపడింది. నిందితుల నుంచి రూ. 10 లక్షల నగదు, 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు పోలీసులు సీజ్ చేశారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు డబ్బులు ఇచ్చి వారి దుర్వసనాలకు ఆసరాగా నిలిచి ఈ దొంగతనాలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!