CM Chandrababu: గూగుల్ పెట్టుబడి వైజాగ్కి రావడానికి కారణం లా అండ్ ఆర్డర్..
- పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..
- ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్.. రౌడీయిజం, నక్సలిజాన్ని అంతం చేశారు..
- పోలీసులు కఠినంగా ఉంటారు కానీ వారికి మానవత్వం ఎక్కువ: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మంగళగిరి APSP బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు. పణంగా పెడుతున్న వారు పోలీసులు.. శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం ముడి పడి ఉంటాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు.. అందుకే క్రైమ్ రేట్ అణిచి వేయటంలో నేను కాంప్రమైజ్ కాను అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: RAPO : రామ్ – భాగ్యశ్రీ.. లవ్ కన్ఫమ్ చేసిన ‘చౌ మామ’..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుర్తింపు ఉందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటారు కానీ వారికి మానవత్వం ఎక్కువ అని పొగడ్తలతో ముంచెత్తారు. నేరాల తీరు మారుతోంది.. క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు.. సైబర్, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి.. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం.. డ్రగ్స్, గంజాయిని గుర్తించి ధ్వంసం చేస్తున్నాం.. ఎర్ర చందనం అడవుల్లో గుర్తించి పట్టుకుంటున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Tension in Tenali: చంద్రబాబు కాలనీలో ఉద్రిక్తత- చిన్నపిల్లల గొడవతో కుటుంబంపై దాడి
అలాగే, విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు కూడా కొత్త వెర్షన్ గా మారి ముందుకు వెళ్ళాలి.. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటే తప్ప వారిని కట్టడి చేయలేం అన్నారు. గూగుల్ పెట్టుబడి వైజాగ్ రావటానికి కారణం లా అండ్ ఆర్డర్.. గతంలో ఐటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీది భవిష్యత్.. రాజకీయ ముసుగులో కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి.. ప్రాణం కంటే మనం చేసే పనులు ముఖ్యం.. కొన్ని రాజకీయ పార్టీలు ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!