CM Chandrababu: గూగుల్ పెట్టుబడి వైజాగ్కి రావడానికి కారణం లా అండ్ ఆర్డర్..
- పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..
- ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్.. రౌడీయిజం, నక్సలిజాన్ని అంతం చేశారు..
- పోలీసులు కఠినంగా ఉంటారు కానీ వారికి మానవత్వం ఎక్కువ: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మంగళగిరి APSP బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు. పణంగా పెడుతున్న వారు పోలీసులు.. శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమం ముడి పడి ఉంటాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు.. అందుకే క్రైమ్ రేట్ అణిచి వేయటంలో నేను కాంప్రమైజ్ కాను అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: RAPO : రామ్ – భాగ్యశ్రీ.. లవ్ కన్ఫమ్ చేసిన ‘చౌ మామ’..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుర్తింపు ఉందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటారు కానీ వారికి మానవత్వం ఎక్కువ అని పొగడ్తలతో ముంచెత్తారు. నేరాల తీరు మారుతోంది.. క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు.. సైబర్, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి.. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం.. డ్రగ్స్, గంజాయిని గుర్తించి ధ్వంసం చేస్తున్నాం.. ఎర్ర చందనం అడవుల్లో గుర్తించి పట్టుకుంటున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Tension in Tenali: చంద్రబాబు కాలనీలో ఉద్రిక్తత- చిన్నపిల్లల గొడవతో కుటుంబంపై దాడి
అలాగే, విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలీసులు కూడా కొత్త వెర్షన్ గా మారి ముందుకు వెళ్ళాలి.. నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేస్తున్నారు.. వారి కంటే ముందుంటే తప్ప వారిని కట్టడి చేయలేం అన్నారు. గూగుల్ పెట్టుబడి వైజాగ్ రావటానికి కారణం లా అండ్ ఆర్డర్.. గతంలో ఐటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీది భవిష్యత్.. రాజకీయ ముసుగులో కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి.. ప్రాణం కంటే మనం చేసే పనులు ముఖ్యం.. కొన్ని రాజకీయ పార్టీలు ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!