YS Jagan: రాష్ట్రంలో ప్రజల తరఫున తమ గొంతు వినిపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమకు బలం తక్కువగా ఉన్నప్పటికీ, మండలిలో మంచి సంఖ్యాబలం ఉందని, అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వాన్ని ఆధారాలతో ప్రశ్నించాలని,…
గతంలో ఉన్న ఈడీ కేసుల్లో జగన్ అరెస్ట్ కావడం ఖాయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో అవినీతిలేని డిపార్ట్మెంట్ లేదని.. జగన్ ఖచ్చితంగా జైలుకు వెళతారు.. తప్పలు చేసినవారిక శిక్ష తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును 53రోజులు జైల్లో ఉంచి ఏం నిరూపించగలిగారు?