కంబోడియాలో పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 20 మంది సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని కంబోడియా ప్రధాని హున్ మానెట్ తెలిపారు. కంపాంగ్ స్పీ ప్రావిన్స్లోని సైనిక స్థావరంలో జరిగిన పేలుడు గురించి తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మానెట్ ఫేస్బుక్లో ఒక పోస్ట్లో తెలిపారు.