ఓ వైపు కన్నబిడ్డ చనిపోయినందుకు బాధ.. మరో వైపు కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్కు డబ్బుల్లేని దీనస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితిలో ఓ తండ్రికి మరో మార్గం కనిపించక.. తన కుమారుడి మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని బస్సులో దాదాపు 200 కిమీ ప్రయాణించాడు. ఈ హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్ జరిగింది.