సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1న ప్రారంభమైంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ప్రారంభించిన ఈ మహాపాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. అయితే నేడు 27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 12 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రైతుల పాదయాత్ర అంబాపురం వద్ద ముగియనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ…