డిఫరెంట్ టైటిల్తో, ఈ జనరేషన్ యూత్ కోరుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ చిత్రం. సుధాకర్ జంగం, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్యామ్ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. 152 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్లో.. క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ యాంగిల్స్ను చూపించారు. ట్రైలర్ ఆద్యంతం…