అల్లు అరవింద్ తన తల్లి అల్లు కనకరత్నం మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అల్లు కనకరత్నం దశదిన కర్మను హైదరాబాద్లో నిర్వహించారు. అల్లు అరవింద్ దుఃఖంలో ఉండగా, ఆయనను పరామర్శించేందుకు సినీ పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. Also Read:Malayalam Actresses: టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మల్లు భామలు?…
అల్లు రామలింగయ్య భార్య, శ్రీమతి అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. మనిషి పోయాక కాలి బూడిద అయిపోయే వాటిని ఇతరులకు దానం చేయడం మంచి విషయం. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని అప్పట్లో ఆమె మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరణించిన…