(సెప్టెంబర్ 12న అక్కినేని అమల పుట్టినరోజు) అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా, అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తున్నారు అమల. నవతరం కథానాయకుడుగా తనయుడు అఖిల్ ను…
బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలోనూ ఈ షోపై విరుచుకుపడ్డ నారాయణ.. ఇదో బూతు ప్రోగ్రాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ‘ఇలాంటి అనైతిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని కోర్టులో వ్యాజ్యం వేసినా న్యాయవ్యవస్థ కూడా సహకరించడం లేదు. ఇలాంటి వాటి పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం…
బిగ్ బాస్ సీజన్ 5 లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఒక చోట చేరడంతో అది ఫిష్ మార్కెట్ ను తలపిస్తోంది. నిజం చెప్పాలంటే… ఈ 19 మందిని గుర్తుపెట్టుకోవడం వ్యూవర్స్ కు అసలు సిసలు టాస్క్ గా మారిపోయింది. పైగా ఒక రోజు జరిగిన సంఘటనలన్నింటినీ కేవలం ఓ గంటకు కుదించడం వీడియో ఎడిటర్స్ కు సైతం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ను…
అనుకున్నట్టుగానే బిగ్ బాస్ 5లో ఆవేశకావేశాలు, అపార్థాలకు తొలి రోజునే తెరలేచింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్స్ లో ఇగోస్ కు దాదాపుగా మెజారిటీ కంటెస్టెంట్స్ పెద్ద పీట వేశారు. నామినేషన్ ప్రక్రియ సింగర్ రామచంద్రతో మొదలై, ఆర్. జె. కాజల్ తో ముగిసింది. మానస్, జస్వంత్ ను రామచంద్ర నామినేట్ చేయగా; కాజల్, రవిని సరయు నామినేట్ చేసింది. ఇక స్వాతివర్మ… హమిదా, నటరాజ్ మాస్టర్లను నామినేట్ చేసింది. విశ్వ… జస్వంత్, మానస్…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభం అయింది. వరుసగా మూడవసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ 5వ సీజన్ లో మొత్తం 19 మంది పోటీదారులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది బిగ్ బాస్ 5 ముందు పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదురు చూస్తున్నాయి. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అంతగా పరిచయం లేని ముఖాలే ఎక్కువగా…
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి బుల్లితెర వినోద కార్యక్రమాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల కంటెంట్ లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ విషయంలో పోటాపోటీ కార్యక్రమాలు వస్తుండగా.. నిన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా భారీ ఎత్తున ప్రారంభించారు. మొదటి రోజే 19 మంది కన్సిస్టెంట్స్ బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా మంది ప్రేక్షకులకు తెలియకపోవడంతో…
తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే.. 1…
వినోద ప్రియులు, మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న, స్టార్ మా ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ స్టార్ మా ఛానెల్పై సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. బిగ్బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను…
(ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు)నటసమ్రాట్ ఏయన్నార్ వారసునిగా ‘యువసమ్రాట్’గా అడుగు పెట్టిన నాగార్జున తొలి నుంచీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథా చిత్రాలు అచ్చి వస్తాయని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీగా రూపొందిన ‘విక్రమ్’తో హీరోగా జనం ముందు నిలిచారు నాగ్. ఆ తరువాత ‘మజ్ను’గానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పర్సనాలిటీకి తగ్గ కథలను ఎంచుకుంటూ ఏయన్నార్ అభిమానుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. నాగార్జున సైతం అదే…
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…