హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఉగ్ర కుట్ర కోణం బయటపడింది. ఒక వైద్యుడి ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్కు చెందిన ముజాహిల్ షకీల్గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్ ఏటీఎస్ పోలీసుల ఆపరేషన్లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది.