Haryana: ఫరీదాబాద్లో ఉగ్ర కలకలం… భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
- ఫరీదాబాద్లో ఉగ్ర కలకలం
- భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఉగ్ర కుట్ర కోణం బయటపడింది. ఒక వైద్యుడి ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్కు చెందిన ముజాహిల్ షకీల్గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్ ఏటీఎస్ పోలీసుల ఆపరేషన్లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది. మూడు రోజుల క్రితం అనంత్నాగ్లో డాక్టర్ ఆదీల్ అరెస్ట్ అయ్యాడు. ఆదీల్ ఇచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్లో ఈ ఉగ్ర కుట్ర గుట్టురట్టైంది.
ఇది కూడా చదవండి: Odisha: జాజ్పూర్లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ ఆస్పత్రిపై విచారణ సందర్భంగా డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ అందించిన సమాచారం ఆధారంగా అధికారులు జరిపిన దాడిలో ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ముజామిల్ షకీల్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో సహాయం చేసినట్లు అనుమానిస్తున్న పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి డాక్టర్ ముజామిల్ షకీల్ ప్రమేయం ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, ఘజ్వత్-ఉల్-హింద్లతో ఈ వైద్యులకు సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump-BBC: ట్రంప్ ప్రసంగం ఎడిట్పై ఇక్కట్లు.. బీబీసీ డైరెక్టర్, సీఈవో రాజీనామా
నిందితులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసు నమోదు చేశారు. శీతాకాలం కోసం ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు మైదానాల్లో సురక్షితమైన ఆశ్రయాలను వెతుకుతున్నారని నిఘా వర్గాలు సూచించడంతో రాంబన్, కిష్త్వార్, దోడా, కథువా, రియాసి, పూంచ్, రాజౌరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో సోదాలు, కార్డన్ డ్రైవ్లు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఉగ్ర కుట్రలు వెలుగుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!