ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు గుండెలు గుభేలుమనిపిస్తున్నాయి. టెక్నికల్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ అగ్నిప్రమాదాలకు గురవడం, కూలిపోవడం జరుగుతోంది. తాజాగా బొలీవియన్ రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ C-130 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించినట్లు సమాచారం. విమానం దేశంలోని ఇతర ప్రాంతాలకు కొత్త నోట్లను తీసుకువెళుతోందని, అయితే ప్రమాదం కారణంగా నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయని సమాచారం. విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు…