నేడు చంచల్ గూడ జైలుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయన ములాఖత్ అవనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయవాదులను కూడా నియమించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు…
నిరసన చెప్పే పద్ధతి ఇది కాదని, అగ్నిఫథ్ మంచి స్కీమ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్మీలో సేవ చేయలనుకునే యువకులను 40 వేల మంది రిక్రూట్ మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రిక్రూట్ మెంట్ లో పది శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు బండి సంజయ్. ఆర్మీలో పనిచేయాలని సేవ చేయాలని అనుకున్న వాళ్లకు మంచి అవకాశం మని…