జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బిల్లింగ్ అనుమతికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు పట్టుబడ్డారు. విటల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విటల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి ఎనిమిది లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. నాలుగు లక్షలు తీసుకొని మరో నాలుగు లక్షలు డిమాండ్ చేయడంతో వెంకట్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.