శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ మగ శిశువును కన్నవారే నిర్దాక్షిణ్యంగా ముల్లపొదల్లో వదిలేసి వెళ్లారు. ఆ అమాయక పసిబిడ్డ ఏడుపు గ్రామాన్ని కదిలించింది. ఒక అపరిచిత మహిళ చూపిన మానవత్వంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బూరగాం గ్రామానికి చెందిన ఓ మహిళకు ముల్లపొదల వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా.. చీమలు కుడుతున్న పరిస్థితిలో,…
అమ్మా.... అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలో జరిగిన ఘటన తలచుకుంటే ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనే అనుమానం కలగక మానదు. ఏప్రిల్ 28న గ్రామ శివారులోని గంగమ్మ గుడి దగ్గర ఉన్న గడ్డివాములో అప్పుడే పుట్టిన మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.