18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపీల చేత ప్రమాణం చేయించనున్నారు.
18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉందని శుక్రవారం ఈ సమాచారాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
18వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను నేడు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి రాష్ట్రపతిని కలుసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీఐ జారీ చేసిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు కాపీని ఆమెకు సమర్పించారు. AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై…