T20 World Cup: టీ20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం
- టీ20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం
- 120 బంతుల్లో 344 పరుగులు చేసి సరికొత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ 20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే వండర్ సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో జట్టు చెలరేగిపోయింది. 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 120 బంతుల్లో 344 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన జట్టుగా చరిత్రలో నిలిచింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్లో గాంబియాపై సికందర్ రజా 33 బంతుల్లో సెంచరీ చేయడంతో జింబాబ్వే నేపాల్ రికార్డు 314-3ను అధిగమించింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రత్యర్థి జట్టు గాంబియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 43 బంతుల్లో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, 15 సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 133 పరుగులు చేసి జింబాబ్వేకు భారీ స్కోరు అందించాడు.
ఇది కూడా చదవండి: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
గాంబియా జట్టుపై జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే తరఫున టీ 20లో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్గా రికార్డ్ నెలకొల్పాడు. సికిందర రజాతో పాటు తడివానాశే మారుమణి రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు బాది 62 పరుగులు చేశాడు. బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. క్లైవ్ మండాడే 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ చేశారు. అందరూ సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే జట్టు టీ 20లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది.
టీ 20లలో ఇప్పటివరకు నేపాల్ పేరు మీద అత్యధిక పరుగుల రికార్డు ఉంది. 2023 సెప్టెంబర్లో మంగొలియా జట్టుపై నేపాల్314 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఈ నెలలో బంగ్లాదేశ్ మీద ఇండియా 297 పరుగులు చేసింది. సీషెల్స్పై జింబాబ్వే 286 రన్స్ చేసింది. 2019 ఫిబ్రవరిలో ఐర్లాండ్ జట్టుపై ఆఫ్ఘానిస్థాన్ 278 రన్స్ చేసింది.
ఇది కూడా చదవండి: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!