T20 World Cup: టీ20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం
- టీ20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం
- 120 బంతుల్లో 344 పరుగులు చేసి సరికొత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ 20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే వండర్ సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో జట్టు చెలరేగిపోయింది. 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 120 బంతుల్లో 344 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన జట్టుగా చరిత్రలో నిలిచింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్లో గాంబియాపై సికందర్ రజా 33 బంతుల్లో సెంచరీ చేయడంతో జింబాబ్వే నేపాల్ రికార్డు 314-3ను అధిగమించింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రత్యర్థి జట్టు గాంబియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 43 బంతుల్లో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, 15 సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 133 పరుగులు చేసి జింబాబ్వేకు భారీ స్కోరు అందించాడు.
ఇది కూడా చదవండి: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
Also Read
గాంబియా జట్టుపై జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే తరఫున టీ 20లో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్గా రికార్డ్ నెలకొల్పాడు. సికిందర రజాతో పాటు తడివానాశే మారుమణి రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు బాది 62 పరుగులు చేశాడు. బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. క్లైవ్ మండాడే 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ చేశారు. అందరూ సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే జట్టు టీ 20లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది.
టీ 20లలో ఇప్పటివరకు నేపాల్ పేరు మీద అత్యధిక పరుగుల రికార్డు ఉంది. 2023 సెప్టెంబర్లో మంగొలియా జట్టుపై నేపాల్314 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఈ నెలలో బంగ్లాదేశ్ మీద ఇండియా 297 పరుగులు చేసింది. సీషెల్స్పై జింబాబ్వే 286 రన్స్ చేసింది. 2019 ఫిబ్రవరిలో ఐర్లాండ్ జట్టుపై ఆఫ్ఘానిస్థాన్ 278 రన్స్ చేసింది.
ఇది కూడా చదవండి: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..